రూ.2 వేల నోట్ల గురించి మరో షాకింగ్ న్యూస్..!

| Edited By:

Jan 17, 2020 | 6:01 PM

అవినీతి, నకిలీ కరెన్సీ దందా, నల్లధనం.. ఈ మూడింటికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ డీమోనిటైజేషన్ పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత ఎంతో కట్టుదిట్టంగా రూ.2 వేల రూపాయల నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వాటి గురించి ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ఆ నోట్లు కాపీ కొట్టేందుకు వీలుగా ఉండటమే కాకుండా.. నకిలీ నోట్లను ఈజీగా రూపొందించేందుకు అనువుగా ఉన్నాయని తేలింది. […]

రూ.2 వేల నోట్ల గురించి మరో షాకింగ్ న్యూస్..!
Follow us on

అవినీతి, నకిలీ కరెన్సీ దందా, నల్లధనం.. ఈ మూడింటికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ డీమోనిటైజేషన్ పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత ఎంతో కట్టుదిట్టంగా రూ.2 వేల రూపాయల నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వాటి గురించి ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ఆ నోట్లు కాపీ కొట్టేందుకు వీలుగా ఉండటమే కాకుండా.. నకిలీ నోట్లను ఈజీగా రూపొందించేందుకు అనువుగా ఉన్నాయని తేలింది. అంతేకాకుండా దేశంలో హల్చల్ చేస్తున్న ఫేక్ కరెన్సీలో అత్యధిక శాతం రూ.2 వేల నోట్లే ఉండటం గమనార్హం.

ఇటీవల నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో అందించిన నివేదిక ప్రకారం మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ భాగం రూ.2వేల రూపాయల నోట్లు ఉండటమే కాకుండా 56 శాతంపైగా మార్కెట్ లో ఫేక్ కరెన్సీ ప్రవేశించిందని తెలిపింది. అంతేకాకుండా గుజరాత్ దొంగ నోట్ల అడ్డాగా మారిందని స్పష్టం చేసింది. కాగా, 2016 నవంబర్ 8వ తేదీన మోదీ రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.