భారత్ అంటే పాక్కు ఎంత ద్వేషమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎదురుగా ఫేస్ చెయ్యడం చేతకాక..దొడ్డి దారుల్లో తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటుంది. వెనుక నుంచి మన జవాన్లపై కాల్పులు జరపడం..పక్క దేశాల వద్దకు వెళ్లి ఇండియాను బ్లెయిమ్ చేసే ప్రయత్నం చేయడం..యూన్లో కంప్లైంట్ చెయ్యడం ఇలా చాలా మార్గాలనే పాక్ ఎన్నుకుంది. కానీ భారత్ ముందు దాయాది దేశం పాచికలు పారలేదు. తాజాగా పాక్కు చెందిన వివాదాస్పద గాయని రబ్బీ పిర్జాదా భారత్ను కించపరిచేందుకు నూతన మార్గాన్ని ఎన్నుకుంది.
اخر کار کشمیری بہن بھائی کیساتھ ایک یہی راستہ ہوگا ۔جب اقوامی متحدہ ثالثی میں فیل ہوگا۔ pic.twitter.com/ZnHQj35HE3
— Rabi Pirzada Bodyguard (@FunRabi) October 21, 2019
ఇండియాను టార్గెట్ చేస్తూ తన సోషల్ మీడియా పేజీలో ఎప్పటికప్పుడు వివాదాస్పద కమెంట్స్ పోస్ట్ చేసే ఈ సింగర్.. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన పోస్ట్ పెట్టింది. అసభ్య పదజాలాన్ని వాడుతూ బెదిరించే ప్రయత్నం చేసింది. ఆత్మాహుతి బాంబర్ జాకెట్ ధరించి మోదీ కోసమే అంటూ ట్వీట్ చేసింది సదరు సింగర్. అంతేకాదు మోదీని అడాల్ఫ్ హిట్లర్తో పోల్చింది. ఈమె వ్యాఖ్యలు.. చేసిన చేష్టలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు భారత నెటిజన్లు. మా ప్రధానిని టార్గెట్ చేస్తే తోలు తీస్తాం అంటూ ఇప్పటికే మనవాళ్లు వార్నింగ్స్ ఇచ్చేశారు. మరికొందరు..’ ఏంటి ఇది మీ పాకిస్తాన్ యూనిఫామా’ అంటూ రబ్బీకి సెటైర్స్ వేస్తున్నారు. ఆ మధ్య చేతుల్లో పాముల్ని పట్టుకోని వీటిని మోదీ మీదకు వదులుతా అంటూ కూడా ఈ నటి రచ్చ చేసిన సంగతి తెలిసిందే.