డ్రాగ‌న్ కంట్రీ నుంచి మిస్ట‌రీ విత్త‌నాల పార్శిళ్లు.. వ‌ణికిపోతున్న అమెరిక‌న్లు !

| Edited By:

Jul 30, 2020 | 12:06 AM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో డ్రాగ‌న్ కంట్రీ చైనా నుంచి వ‌చ్చిన మిస్ట‌రీ విత్త‌నాల‌తో కూడిన‌ పార్శిళ్లు అమెరిక‌న్ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. యూఎస్‌లోని

డ్రాగ‌న్ కంట్రీ నుంచి మిస్ట‌రీ విత్త‌నాల పార్శిళ్లు.. వ‌ణికిపోతున్న అమెరిక‌న్లు !
Follow us on

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో డ్రాగ‌న్ కంట్రీ చైనా నుంచి వ‌చ్చిన మిస్ట‌రీ విత్త‌నాల‌తో కూడిన‌ పార్శిళ్లు అమెరిక‌న్ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. యూఎస్‌లోని సుమారు 27 రాష్ట్రాల వాసుల్ని ఈ విత్త‌నాల పార్శిళ్లు వణికిస్తున్నాయి. వర్జీనియా, వాషింగ్టన్, అరిజోనా, ఇండియానా, లూసియానా, టెక్సాస్‌ల‌తో పాటు ఇత‌ర‌ రాష్ట్రాలకు చెందిన కొంతమంది చిరునామాలకు మిస్టరీ విత్తనాల పార్శిళ్లు రావ‌డం ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది.

కరోనా సంక్షోభ సమయంలో.. ఎవ‌రూ ఎలాంటి ఆర్డ‌ర్లు ఇవ్వ‌కున్నా.. కొరియర్‌లో వచ్చిన ఈ విత్తనాలపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ విత్తనాలు వింతగా ఉండ‌డంతో పాటు ఆ కవర్లమీద చైనా భాష ఉంది. ఈ విత్తనాలు ఎక్కడా భూమిలో నాటవద్దని, ఇవి హానికారక విత్తనాలు కావొచ్చ‌ని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విత్తనాల గుట్టుర‌ట్టు చేసే ప‌నిలో అమెరికా అధికారులు, శాస్త్ర‌వేత్త‌లు ఉన్నారు. అసలు ఏ ఉద్దేశ్యంతో ఈ విత్తనాలు అమెరికన్లకు పంపారో తేల్చే ప‌నిలో ఉన్నారు.

కోవిద్-19 నేపథ్యంలో డ్రాగ‌న్ దేశంపై కోపంతో ఉన్న అగ్ర‌రాజ్యం.. ఈ విత్త‌నాల విష‌యాన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి. కాగా.. పార్శిల్ అందుకున్న‌వారు వెంట‌నే త‌మ‌కు స‌మాచారం అందించాల‌ని అమెరికా అధికారులు తెలిపారు.

[svt-event date=”29/07/2020,6:55PM” class=”svt-cd-green” ]

[svt-event date=”29/07/2020,6:55PM” class=”svt-cd-green” ]