విజయవాడలో ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా చెలగాటం

|

Oct 03, 2020 | 2:16 PM

విజయవాడలో ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా చెలగాటం ఆడుతోంది. నిల్వ ఉంచిన మాంసాన్ని ప్రజలకు విక్రయిస్తూ, కొత్త ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నారు.

విజయవాడలో ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా చెలగాటం
Follow us on

విజయవాడలో ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా చెలగాటం ఆడుతోంది. నిల్వ ఉంచిన మాంసాన్ని ప్రజలకు విక్రయిస్తూ, కొత్త ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నారు. తాజాగా ఇతర రాష్ట్రాల నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న పోటెళ్ల మాంసంను రైల్వే పార్సిల్ కార్యాలయంలో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సీజ్ చేశారు. 16 పార్సిల్ బాక్సులలో ఢిల్లీ నుండి విజయవాడకు వచ్చిన నిల్వ ఉంచిన మాంసం వచ్చినట్లు గుర్తించారు. రేపు ఆదివారం కావటంతో నిల్వ ఉంచిన మాంసాన్ని ప్రజలకు అమ్మేందుకు మటన్ మాఫియా ప్రణాళికలు రూపొందించింది. సమాచారం అందుకున్న కార్పోరేషన్ అధికారులు రైల్వే పార్సెల్ కార్యలయంలో తనిఖీలు నిర్వహించి, మాఫియా ఆట కట్టించారు.

కాగా గత కొద్ది రోజులుగా ఇదే తరహాలో మాంసం దిగుమతి అవుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ ఘటనపై బెజవాడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనాతో పాటు వివిధ రకాల వ్యాధులతో అల్లాడుతుంటే, డబ్బుల కోసం ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు మటన్ మాఫియా తెగబడటంపై భగ్గుమంటున్నారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఈ మధ్య ప్రజలు ఎక్కువగా మాంసం తింటున్న విషయం తెలిసిందే.

Also Read :

సీఎం జగన్ భారీ కటౌట్ కు క్రేన్ ద్వారా పాలాభిషేకం

ఢిల్లీలో వంగవీటి రాధా..ఏం చేస్తున్నారంటే ?