ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు

|

Oct 18, 2020 | 10:13 PM

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం సాయంత్రం స్వామివారు ముత్యపుపందిరి వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు
Follow us on

Navaratri Brahmotsavalu : తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం సాయంత్రం స్వామివారు ముత్యపుపందిరి వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగు రోజు సోమవాం ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనమివ్వనున్నారు. కార్యక్రమంలో పెదజీయర్‌స్వామి, చినజీయర్‌ స్వామి, ఈఓ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ప్రసాద్‌, గోవింద హరి, సీవీఎస్‌ఓ గోపినాథ్‌ జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ రమేశ్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌ పాల్గొన్నారు.