‘దిశ’పై చర్చ.. సభలో నిద్ర.. ఎవరా ఎంపీ.?

| Edited By: Ram Naramaneni

Dec 03, 2019 | 4:10 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశపై అత్యాచారం, హత్య కేసుపై పార్లమెంట్‌లో వాడీవేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నేషనల్ వైడ్‌గా యువతలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. నిందితులపై కేసులు, కోర్టుల విచారణ వద్దని.. బయటికి పంపిస్తే తామే చంపేస్తామని చెబుతున్నారు. రాష్ట్రాలకు అతీతంగా ఎంపీలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అటు ప్రభుత్వం, కేంద్రం కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని […]

దిశపై చర్చ.. సభలో నిద్ర.. ఎవరా ఎంపీ.?
Follow us on

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశపై అత్యాచారం, హత్య కేసుపై పార్లమెంట్‌లో వాడీవేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నేషనల్ వైడ్‌గా యువతలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. నిందితులపై కేసులు, కోర్టుల విచారణ వద్దని.. బయటికి పంపిస్తే తామే చంపేస్తామని చెబుతున్నారు.

రాష్ట్రాలకు అతీతంగా ఎంపీలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అటు ప్రభుత్వం, కేంద్రం కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. ఇక పార్లమెంట్ ఉభయసభల్లో ఈ చర్చ సందర్భంగా కొందరు ఎంపీలు భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఇంతటి హీటెడ్ టాపిక్ జరుగుతున్న సమయంలో ఓ తెలుగు ఎంపీ తాపీగా నిద్రమత్తులో తూలుతూ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇక ఆయనెవరు అని అనుకుంటున్నారా.. గతంలో పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించి.. మొదటిసారి ఎంపీగా పోటీ చేసి.. భారీ మెజార్టీతో గెలుపొందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. దిశ ఉదంతంపై  చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీలందరూ కూడా ఉద్వేగానికి గురై మాట్లాడుతున్న సమయంలో తాను ఒక మాజీ పోలీస్ అధికారిన్న భావన కూడా లేకుండా.. నిద్రలోకి జారుకున్న వైనాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి.