నా కసి తీరింది : మోత్కుపల్లి

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2019 | 1:37 PM

2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడి పరాజయం తనకెంతో ఆనందం కలిగించిందని తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంద్రబాబు రాజకీయంగా అంతరించిపోవాలన్న నా కోరిక వెంకన్న నెరవేర్చడంతో స్వామి వారి మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చానన్నారు మోత్కుపల్లి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారం కోసం కుట్రలు చేసిన బాబును ఏపీ ప్రజలు తరిమికొట్టారన్నారు. నమ్మకానికి వైఎస్ కుటుంబం మారుపేరని, జగన్ పాలనలో ప్రజలు హాయిగా ఉంటారని చెప్పారు. తెలంగాణలో ఎలాగో టీడీపీ లేదు.. ఇక ఏపీలో […]

నా కసి తీరింది : మోత్కుపల్లి
Follow us on

2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడి పరాజయం తనకెంతో ఆనందం కలిగించిందని తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంద్రబాబు రాజకీయంగా అంతరించిపోవాలన్న నా కోరిక వెంకన్న నెరవేర్చడంతో స్వామి వారి మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చానన్నారు మోత్కుపల్లి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారం కోసం కుట్రలు చేసిన బాబును ఏపీ ప్రజలు తరిమికొట్టారన్నారు. నమ్మకానికి వైఎస్ కుటుంబం మారుపేరని, జగన్ పాలనలో ప్రజలు హాయిగా ఉంటారని చెప్పారు. తెలంగాణలో ఎలాగో టీడీపీ లేదు.. ఇక ఏపీలో కూడా టీడీపీ అంతమైపోతుందని పేర్కొన్నారు. ఎవరు ఎక్కువ డబ్బు చూపితే వారికే చంద్రబాబు పదవులు కేటాయిస్తారని మోత్కుపల్లి ఆరోపించారు.