Tirumala : గుడ్ న్యూస్..తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు…!

|

Feb 24, 2020 | 2:48 PM

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు టిటిడి కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లేందుకు మోనో రైలును అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. స్వామివారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.

Tirumala : గుడ్ న్యూస్..తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు...!
Follow us on

Tirumala :  తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు టిటిడి కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లేందుకు మోనో రైలును అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. స్వామివారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని..తిరుమలలో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి టిటిడి పూనుకుంది. దీనిపై ఇప్పటికే టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో భేటీ అయ్యి..చర్చలు జరిపారు. తిరుపతి నుంచి తిరుపతికి మోనో రైలు,  లైట్ మెట్రోలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.  ఏడుకొండల్లో ఎలాంటి టన్నెల్ తవ్వకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు అవకాశాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీని కోరినట్టు స్పష్టం చేశారు. ఆస్ట్రియాలో ఎత్తైన కొండపైకి మోనో రైలు మార్గం ఉందని..దాన్ని ప్రాతిపదికగా తీసుకుని తిరుమలకు రైలు సౌకర్యాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.