నిప్పులపై నడిచిన ఎమ్మెల్యే..

|

Dec 28, 2019 | 12:14 PM

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు.  అయ్యప్ప స్వామి వేడుకలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిప్పులపై నడిచారు. ఇతర భక్తులతో పాటు పిల్లలు కూడా నిప్పులపై నడిచారు. మహబూబాబాద్ లో అయ్యప్ప స్వాముల సంకీర్తనతో వీధులు మారుమ్రోగాయి. అయ్యప్ప స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వామివారి రథాన్నిలాగి ఊరేగింపును ప్రారంభించారు. మిగతా స్వాములతో కలిసి ఆయన ఊరేగింపులో పాల్గొన్నారు. దేవుడిపై గల భక్తే తమను నిప్పులపై నడిచేలా […]

నిప్పులపై నడిచిన ఎమ్మెల్యే..
Follow us on

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు.  అయ్యప్ప స్వామి వేడుకలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిప్పులపై నడిచారు. ఇతర భక్తులతో పాటు పిల్లలు కూడా నిప్పులపై నడిచారు. మహబూబాబాద్ లో అయ్యప్ప స్వాముల సంకీర్తనతో వీధులు మారుమ్రోగాయి. అయ్యప్ప స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వామివారి రథాన్నిలాగి ఊరేగింపును ప్రారంభించారు. మిగతా స్వాములతో కలిసి ఆయన ఊరేగింపులో పాల్గొన్నారు. దేవుడిపై గల భక్తే తమను నిప్పులపై నడిచేలా చేసిందని తెలిపారు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌. జిల్లా అభివృద్ధి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ అయ్యప్పను వేడుకున్నట్లుగా తెలిపారు. ఉత్సవ వేడుక చివర్లో అయ్యప్పస్వామికి ప్రధాన అర్చకుడు ప్రత్యేక పూజ చేశారు. ఒంటిపై ఇ‌ష్టానుసారం నిప్పులు చల్లుకున్నారు. తర్వాత నిప్పులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ నడిచారు. ఇతర భక్తులతో ఓ బాలుడు, పాప నిప్పులపై నడిచారు. తర్వాత నిప్పులు చుట్టూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ పాటలు పాడారు.