తీవ్ర అస్వస్థతకు గురైన ‘మిషన్ మంగళ్’ డైరెక్టర్

| Edited By:

Jan 26, 2020 | 12:34 PM

ఇటీవలే అన్ని భాషల్లోనూ ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన బాలీవుడ్ ‘మిషన్ మంగళ్’ డైరెక్టర్ జగన్ శక్తి అస్వస్థతకు గురైయ్యారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురై, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో.. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. హాలీడే, ఇంగ్లీష్ వింగ్లీష్, డియర్ జిందగీ చిత్రాలకు జగన్ సెకండ్ యూనిట్ […]

తీవ్ర అస్వస్థతకు గురైన మిషన్ మంగళ్ డైరెక్టర్
Follow us on

ఇటీవలే అన్ని భాషల్లోనూ ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన బాలీవుడ్ ‘మిషన్ మంగళ్’ డైరెక్టర్ జగన్ శక్తి అస్వస్థతకు గురైయ్యారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురై, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో.. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. హాలీడే, ఇంగ్లీష్ వింగ్లీష్, డియర్ జిందగీ చిత్రాలకు జగన్ సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో రిలీజ్‌ అయిన మిషన్ మంగళ్ చిత్రంతో ఆయన డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. మొదటి చిత్రంతోనే జగన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.