చదువు లేదు, కాసేపు తల్లిదండ్రులతో కూర్చోని మాట్లాడుకోవడం లేదు. ఓన్లీ పబ్జీ. అవును ఇప్పుడు పిల్లలు, యువత పబ్జీ గేమ్కు బానిసలైపోతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ యూత్ తమ అమూల్యమైన సమయాన్ని ఈ ఉపయోగం లేని గేమ్ కోసం వెచ్చిస్తోంది. ఆ గేమ్ ఆడొద్దని మందలిస్తే వారు సైకోలుగా మారిపోతున్నారు. ఎదిటివారిపై దాడి చేయడం, తమ ప్రాణాలే తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇటువంటి ఘటనే జరిగింది.
పబ్జీ గేమ్ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్తో గొంతు కోసుకుని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే బాలుణ్ని చికిత్స నిమిత్తం గుత్తి గవర్నమెంటట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : పెరిగిన వరద ఉదృతి : కడెం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత