రేపు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..!

|

Nov 05, 2020 | 6:54 PM

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ రేపు శుక్రవారం ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు.

రేపు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..!
Follow us on

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ రేపు శుక్రవారం ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. రాష్ట్రానికి కీలకమైన పెట్టుబడుల అంశంలో రేపు ఉదయం 11:30 గంటలకు ప్రకటన చేయనున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. దీంతో రాజకీయ నేతలతో పాటు రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

హైద‌రాబాద్ న‌గ‌రం కొత్త మైలురాయిని అందుకుంద‌ని తెలుపుతూ మంత్రి కేటీఆర్ అంత‌కుక్రితం ట్వీట్ చేశారు. ప్ర‌పంచంలోనే అతిపెద్దదైన వ‌న్‌ప్ల‌స్ స్టోర్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నానన్నారు. వ‌న్‌ప్ల‌స్ ఇండియా టీమ్‌కు మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. త్వ‌ర‌లోనే వ‌న్‌ప్ల‌స్ స్టోర్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.