Minister KTR: రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్న మంత్రి కేటీఆర్.. ఎలాగో తెలుసా..

| Edited By: Pardhasaradhi Peri

Jan 09, 2021 | 6:24 PM

Minister KTR: తెలంగాణలో రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్యలో

Minister KTR: రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్న మంత్రి కేటీఆర్.. ఎలాగో తెలుసా..
Follow us on

Minister KTR: తెలంగాణలో రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్యలో రాష్ట్రానికి ఐదు అతిపెద్ద కంపెనీలు రాబోతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లొ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్టస్టర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉందనే దాని గురించి పలు విషయాలను తెలియజేశారు.

నూతన టెక్నాలజీని వినియోగించుకోవడంలో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని కొనియాడారు. కొత్త ఆవిష్కరణలకు క్లస్టర్ ఉపయోగపడుతుందని, పౌర జీవనంలో పలు మార్పులు సంభవిస్తాయని వివరించారు. ధీర్ఘకాలికంగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ప్రధాని నరేంద్రమోదీ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్‌లో అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. దీంతో నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే ప్రభుత్వ నోటిఫికేషన్లు కూడా ఉంటాయి కనుక రాష్ట్రంలోని నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకోవాలని సూచించారు.

Jobs Recruitment : రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ…. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌