అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచండి..

|

Sep 04, 2020 | 7:56 PM

జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులుపై ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు...

అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచండి..
Follow us on

Minister KTR Review : జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులుపై ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీలో రోడ్ల విస్తరణ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, డ్రైనేజీ విస్తరణపై కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే లాక్‌డౌన్ సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు‌. త్వరలో జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 85 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందేలా పనులు వేగవంతం చేయాలని అధికారులనుమంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.