విజయవాడకు మరో మణిహారం.. “రోడ్ అండ్ బ్రిడ్జ్”

|

Sep 09, 2020 | 1:27 PM

విజయవాడకు మరో మణిహారం వచ్చి చేరుతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలో రోడ్ అండ్ బ్రిడ్జ్ నిర్మాణంకు ప్లాన్ చేసింది.

విజయవాడకు మరో మణిహారం.. రోడ్ అండ్ బ్రిడ్జ్
Follow us on

విజయవాడకు మరో మణిహారం వచ్చి చేరుతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలో రోడ్ అండ్ బ్రిడ్జ్ నిర్మాణంకు ప్లాన్ చేసింది. మధురానగర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ట్రాఫిక్‌ సమస్యపై స్పందించారు. రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని అన్నారు. రూ. 17 కోట్లు ప్రభుత్వ నిధులు,రూ.10 కోట్లు రైల్వే నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది.

6 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాబోతోందని తెలిపారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన అని అన్నారు . 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ తలపెట్టారని అన్నారు. శాసన రాజధాని ఇక్కడ నుంచి తీసేస్తాం అని కొడాలి నాని అనలేదని మంత్రి బొత్స వివరణ ఇచ్చారు. మానవత్వంతో రైతులు ఆలోచించాలని కొడాలి నాని ఉద్దేశం తప్ప, అందులో మరో ఉద్దేశం లేదన్నారు మంత్రి.