2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ.. మాజీ మంత్రి జోస్యం!

|

Sep 03, 2019 | 12:55 AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల విషయంపై టీడీపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు జోస్యం చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జమిలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ […]

2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ.. మాజీ మంత్రి జోస్యం!
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల విషయంపై టీడీపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు జోస్యం చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జమిలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తి చూపిస్తున్నారన్న ఆయన.. ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయన్నారు.

ఇక ఈ వ్యాఖ్యలు బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగిస్తోందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీతో దోస్తీ కొనసాగించారనే వార్తలు జోరుగా వినిపించాయి. మరోవైపు ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలోకి చేరారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును కాపాడేందుకే వీరు బీజేపీలో చేరారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.