ఖైదీ 150తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు చిరు. ఇటీవలే తన తదుపరి చిత్రం ‘లుసీఫర్’ రీమేక్ను షూటింగ్ను కూడా ప్రారంభించాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం చిరు చేస్తున్న తన సినిమాల దర్శకులతో ఫోటో దిగాడు. మై కెప్టెన్స్ ఈ నలుగురు.. ఫెంటాస్టిక్ 4.. చార్ కదమ్.. అంటూ ట్వీట్ చేశాడు. అందులో కొరటాల శివ, మెహర్ రమేష్, మెహర్ రమేష్, బాబీ ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇక మోహన్ రాజాతో కలిసి లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. అలాగే వేదాళం రీమేక్ సినిమాను మెహర్ రమేష్ తీయనున్నాడు. అయితే కొత్తగా బాబీ ఇందులో ఉండడంతో మరో న్యూ మూవీ కూడా చిరు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
My 4 Captains Ee naluguru
Funtastic 4 Char kadam@sivakoratala @jayam_mohanraja @MeherRamesh @dirbobby pic.twitter.com/sn3AaGsAFR— Chiranjeevi Konidela (@KChiruTweets) January 22, 2021
Also Read:
Amitabh bachchan: ఆమె పై కామెంట్స్ చేసిన అమితాబ్.. బిగ్ బీ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..