దారుణం.. పోలీసులమని చెప్పి మహిళపై అత్యాచారం..

|

Feb 11, 2020 | 8:00 PM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పస్తాపూర్ కూడలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను పోలీసునని చెప్పి బెదిరించిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేటకు చెందిన వితంతు మహిళ(37) కొన్నాళ్లు క్రితం పనుల కోసం బీదర్‌ వెళ్లింది. సోమవారం తిరిగి తన కుమారుడితో(12) కలిసి సూర్యపేట పయనమైంది. జాహీరాబాద్ మీదుగా సూర్యాపేటకు బస్సులో వస్తుండగా..పస్తపూర్ చౌరస్తా వద్ద బస్సును ఆపిన ఇద్దరు వ్యక్తులు..సదరు మహిళ వద్ద నిషేధిత పదార్థాలు ఉన్నాయని చెప్పి కిందకి దించారు. ఆ […]

దారుణం.. పోలీసులమని చెప్పి మహిళపై అత్యాచారం..
Follow us on

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పస్తాపూర్ కూడలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను పోలీసునని చెప్పి బెదిరించిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేటకు చెందిన వితంతు మహిళ(37) కొన్నాళ్లు క్రితం పనుల కోసం బీదర్‌ వెళ్లింది. సోమవారం తిరిగి తన కుమారుడితో(12) కలిసి సూర్యపేట పయనమైంది. జాహీరాబాద్ మీదుగా సూర్యాపేటకు బస్సులో వస్తుండగా..పస్తపూర్ చౌరస్తా వద్ద బస్సును ఆపిన ఇద్దరు వ్యక్తులు..సదరు మహిళ వద్ద నిషేధిత పదార్థాలు ఉన్నాయని చెప్పి కిందకి దించారు. ఆ తర్వాత అక్కడే ఎస్‌బిఐ బ్యాంక్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన ఒక వ్యక్తి అత్యాచారం చేయగా, మరో వ్యక్తి ఆమె లగేజీ తీసుకుని పరారయ్యాడు.

మోసపోయానని తెలుసుకున్న మహిళ విషయాన్ని అక్కడే ఉన్న చిన్న హోటల్‌లో ఉన్నవారికి చెప్పడంతో..వారు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.