#COVID2019 ప్రజాయుద్దంతో కరోనాకు చెక్.. మావోయిస్టుల రూటే వేరులే

| Edited By: Anil kumar poka

Mar 26, 2020 | 2:00 PM

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు తనదైన మార్గాన్ని చూపిస్తున్నారు మావోయిస్టులు. కరోనాపై ప్రజా యుద్దం చేయాలని మావోయిస్టులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు విశాఖ మన్యం ఏరియాలో పోస్టర్లు అతికించారు మావోయిస్టులు.

#COVID2019 ప్రజాయుద్దంతో కరోనాకు చెక్.. మావోయిస్టుల రూటే వేరులే
Follow us on

Maoists variety call for people to control #COVID2019: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు తనదైన మార్గాన్ని చూపిస్తున్నారు మావోయిస్టులు. కరోనాపై ప్రజా యుద్దం చేయాలని మావోయిస్టులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు విశాఖ మన్యం ఏరియాలో పోస్టర్లు అతికించారు మావోయిస్టులు.

విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం మద్దిగరువులో ఈస్ట్ డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్టులు పోస్టర్లు అతికించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సృష్టికి మూల కారణం సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విధానాలేనని మావోయిస్టుల పోస్టర్లలో పేర్కొన్నారు. పకృతిని, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజా యుద్ధంలో భాగం కండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ సృష్టి చైనాలో జరిగిన నేపథ్యంలో దానికి సామ్రాజ్య వాదమే కారణమని మావోయిస్టుల చెప్పడం కొత్త చర్చకు తెరలేపుతోంది. పెట్టుబడిదారీ విధానాల వల్లే కరోనా వైరస్ సృష్టి జరిగిందనడం పరోక్షంగా చైనాపై మావోయిస్టులు విమర్శలు చేశారని భావించేలా పోస్టర్లు వెలిశాయి. ఈ క్రమంలో ప్రజలను ప్రజా యుద్దంలో భాగస్వాములవమనడం, చైనా విధానాలను మావోయిస్టులు విమర్శించడం పలువురిలో చర్చనీయాంశాలుగా మారాయి.