ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడు సత్తిబాబు హత్య…అత్యంత దారుణంగా నరికి చంపిన మావోయిస్టులు

|

Dec 23, 2020 | 5:57 PM

విశాఖ జిల్లా పెదబయలు మండలంలో వనగరాయి వద్ద చిక్కుడు సతీష్ అనే గిరిజనుడిని అత్యంత దారుణంగా నరికి చంపారు. అనంతరం మృతదేహం వద్ద కోరుకొండ ఏరియా కమిటీ పేరుతో ఓ లేఖను వదిలివెళ్లారు.

ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడు సత్తిబాబు హత్య...అత్యంత దారుణంగా నరికి చంపిన మావోయిస్టులు
Follow us on

Maoists Brutally Killed : ఏవోబీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని పొట్టనపెట్టుకున్నారు. విశాఖ జిల్లా పెదబయలు మండలంలో వనగరాయి వద్ద చిక్కుడు సతీష్ అనే గిరిజనుడిని అత్యంత దారుణంగా నరికి చంపారు. అనంతరం మృతదేహం వద్ద కోరుకొండ ఏరియా కమిటీ పేరుతో ఓ లేఖను వదిలివెళ్లారు.

సత్తిబాబు పోలీస్ ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. గంజాయి వ్యాపారం చేస్తూ.. మావోయిస్టులు, మిలీషియా కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించినట్లుగా పేర్కొన్నారు. ప్రజాకోర్టు నిర్వహించి ఖతం చేశామని వెల్లడించారు. ప్రజా పోరాటాలకు ద్రోహం చేసేవారెవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

అయితే తన భర్త ఇన్ఫార్మర్ కాదని మృతుడి భార్య పుష్పలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి 11 గంటలకు 40 మంది మావోయిస్టులు వచ్చి మాట్లాడేది ఉందని తీసుకెళ్లారని తెలిపింది. తీసుకెళ్తున్నప్పుడు ఆయన చేతులు వెక్కి కట్టి ఈడ్చుకెళ్లారని తెలిపింది. తన భర్తను వదలిపెట్టాలని వేడుకున్నా వినలేదని..  హత్య చేశారని కన్నీటిపర్యంతం అయ్యింది. మృతుడు చిక్కుడు సతీష్ స్వగ్రామం చింతగొందిగా తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సతీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన అటవి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహింస్తున్నారు.