ఒకనాటి స్నేహానికి గుర్తు ఈ ఫోటో..

| Edited By: Anil kumar poka

Jun 28, 2019 | 11:34 AM

అసలే టైమ్ బాగాలేక కుమిలిపోతున్న సమయంలో సినీ నటి మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు,తన తండ్రి మోహన్‌బాబు కలిసిదిగిన ఫోటో ఒకటి పెట్టి మరీ మాజీ సీఎం చంద్రబాబును ఓ ఆట ఆడుకుంది. ఆమె షేర్ చేసిన ఫోటో వెనుక ఓ కథ ఉంది. గతంలో చంద్రబాబు, మోహన్‌బాబు ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ సంస్ధను వీరిద్దరూ  కలిసి మొదట ప్రారంభించారు. […]

ఒకనాటి స్నేహానికి గుర్తు ఈ ఫోటో..
Follow us on

అసలే టైమ్ బాగాలేక కుమిలిపోతున్న సమయంలో సినీ నటి మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు,తన తండ్రి మోహన్‌బాబు కలిసిదిగిన ఫోటో ఒకటి పెట్టి మరీ మాజీ సీఎం చంద్రబాబును ఓ ఆట ఆడుకుంది. ఆమె షేర్ చేసిన ఫోటో వెనుక ఓ కథ ఉంది. గతంలో చంద్రబాబు, మోహన్‌బాబు ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ సంస్ధను వీరిద్దరూ  కలిసి మొదట ప్రారంభించారు. ఆసమయంలో తీసిందే ఈ ఫోటో. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. ఇటీవల ఎన్నికల సమయంలో చంద్రబాబుపై మోహన్‌బాబు తీవ్రస్ధాయిలో ఆరోపణలు చేశారు.  శ్రీవిద్యానికేతన్‌ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం రోడ్డెక్కి ఆందోళన కూడా చేశారు. ఆతర్వాత ఆయన వైసీపీలో చేరి జగన్ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు మోహన్‌బాబు.

ఇదిలా ఉంటే మంచు లక్ష్మి ఇప్పుడెందుకు ఈ ఫోటో బయటపెట్టిందనే విషయంపై  రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడో 1992లో హెరిటేజ్ సంస్ధకు శంకుస్ధాపన సమయలో తీసిన ఈ ఫోటోతో లక్ష్మి ఏం చెప్పదలచుకున్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఒకనాటి మిత్రులు నేడు బద్ద శత్రువులయ్యారు.కాలం ఎప్పుడు ఒకే తీరులో ఉండదు అని చెప్పేందుకేనా ఈ ఫోటో అనుకుంటున్నారు జనం.