ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఉండుంటే ఆయన మార్కెట్ 400 కోట్లు ఉండేది. : మనసంతా నువ్వే దర్శకుడు

|

Dec 28, 2020 | 10:12 PM

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా వెలిగిన ఉదయ్ కిరణ్ అకస్మాతుగా సినీప్రేమికులను విషాదంలోకి నెట్టి తిరిగిరనిలోకాలకు వెళ్ళిపోయారు..

ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఉండుంటే ఆయన మార్కెట్ 400 కోట్లు ఉండేది. : మనసంతా నువ్వే దర్శకుడు
Follow us on

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా వెలిగిన ఉదయ్ కిరణ్ అకస్మాతుగా సినీప్రేమికులను విషాదంలోకి నెట్టి తిరిగిరనిలోకాలకు వెళ్ళిపోయారు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా సక్సెస్ అయ్యాడు ఉదయ్. ఉదయ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు దర్శకుడు వి ఎన్ ఆదిత్య. ఈ దర్శకుడు ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే, శ్రీ రామ్  సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాల్లో మనసంతా నువ్వే సూపర్ హిట్ సాధించగా శ్రీరాం బాగానే ఆడింది.

హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా మూడు సూపర్ హిట్లు సొంతం చేసుకున్నాడు ఉదయ్ . అదే ఇప్పుడు కానీ అలాంటిది జరిగుంటే ఉదయ్ కిరణ్ మార్కెట్ 400 కోట్లు ఉండేదని అన్నారు ఆదిత్య. ‘నువ్వు నేను’ సినిమా  కోటిన్నరతో తీస్తే 14 కోట్లు షేర్ వసూలు చేసింది.అలాగే ‘మనసంతా నువ్వే’ సినిమాకు 2 కోట్లు పెడితే 16 కోట్లు షేర్ తీసుకొచ్చింది. అలాంటి స్టార్ ఇప్పుడు ఉండిఉంటే ఆయన రేంజ్ వేరేలా ఉండేది అన్నారు ఆదిత్య. అలాంటి ఉదయ్ కిరణ్ అంత త్వరగా చనిపోవడం మాత్రం నిజంగానే అందరికీ షాక్ ఇచ్చాడని ఎమోషనల్ అయ్యారు. ఉదయ్ చనిపోవడానికి నాలుగురోజుల ముందే తనతో మాట్లాడాడని చెప్పుకోచ్చారు ఆదిత్య.