ఇల్లాలితో పాటు ప్రియురాలి సహకారం, రెచ్చిపోయిన గజదొంగ

|

Oct 18, 2020 | 5:14 PM

 కర్నూలు జిల్లాలో జిల్లాలోని ఆలయాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. ఎర్రగుంట్లలోని శ్రీకృష్ణ మందిరం, శిరువెళ్ల పరిధిలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం...

ఇల్లాలితో పాటు ప్రియురాలి సహకారం, రెచ్చిపోయిన గజదొంగ
Follow us on

కర్నూలు జిల్లాలో జిల్లాలోని ఆలయాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. ఎర్రగుంట్లలోని శ్రీకృష్ణ మందిరం, శిరువెళ్ల పరిధిలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, ఆళ్లగడ్డ పరిధిలోని బత్తలూరులో చెన్నకేశవస్వామి ఆలయాలతో పాటు మరికొన్ని చోట్ల చోరీల జరగడంతో..పోలీసులు ఈ కేసులను సవాల్‌గా తీసుకున్నారు. మొత్తానికి ఈ చోరీల మిస్టరీకి తెరపడింది. ఈ చోరీలలో కీలక సూత్రధారి అయిన అంతర్రాష్ట్ర దొంగ అనంతపురం జిల్లా పామిడికి చెందిన ఎరుకలి నల్లబోతుల నాగప్ప అలియాస్‌ రాజు అలియాస్‌ నాగరాజు (42)ను అరెస్ట్ చేశారు. ఇతడికి భార్య, ప్రియురాలు సహకారం అందించారు. దీంతో మహానంది మండలం గాజులపల్లికి చెందిన  ప్రియురాలు లావణ్య అలియాస్‌ సుధ (30), భార్య ప్రమీల (33)లు కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు  అనంతపురం జిల్లాలో 11, కడప జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 2 ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. వీరి నుంచి రూ. 12.30 లక్షల విలువ చేసే 164 గ్రాముల బంగారు ఆభరణాలు, 15.360 కేజీల వెండి ఆభరణాలు , రూ.23780 నగదు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

( Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు ! )