డిగ్రీ పూర్తి చేసుకున్నా.. నెక్ట్స్‌ ఏంటో..!

| Edited By:

Jun 19, 2020 | 7:19 PM

నోబెల్ శాంతి బహుమతి విజేత, పాకిస్థాన్‌కు చెందిన విద్యా కార్యకర్త యూసఫ్‌జాయి మలాలా డిగ్రీని పూర్తి చేసుకున్నారు. బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో ఆమె డిగ్రీని పూర్తి చేసుకున్నారు.

డిగ్రీ పూర్తి చేసుకున్నా.. నెక్ట్స్‌ ఏంటో..!
Follow us on

నోబెల్ శాంతి బహుమతి విజేత, పాకిస్థాన్‌కు చెందిన విద్యా కార్యకర్త యూసఫ్‌జాయి మలాలా డిగ్రీని పూర్తి చేసుకున్నారు. బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో ఆమె డిగ్రీని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో సెలబ్రేషన్స్ చేసుకున్న మలాలా వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ”ఆక్స్‌ఫర్డ్ నుంచి డిగ్రీ పూర్తి చేసుకున్న నా ఆనందాన్ని చెప్పడానికి మాటలు రావట్లేదు. నెక్ట్స్‌ ఏం చేయాలన్న దానిపై ఇంకా ఏం అనుకోలేదు. ఇప్పటికైతే నెట్‌ఫ్లిక్స్‌, చదవడం, నిద్రపోవడం ఇవే నా పనులు” అని కామెంట్ పెట్టారు. కాగా మహిళలకు విద్యపై పోరాటం చేస్తున్న మలాలాకు 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే.

Read This Story Also: అపార్ట్‌మెంట్‌లో ఆరు మృతదేహాలు.. పిల్లలకు ఉరేసి..