ఒడిశాలో ఆదివారం 18 కొత్త కోవిద్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో సామాజిక దూర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని లేదా “క్రిమినల్ చర్య” లను ఎదుర్కోవాల్సి వస్తుందని నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఒడిశాలో మొత్తం కరోనావైరస్ కేసులు 39 వరకు పెరిగాయి. అన్నీ భువనేశ్వర్ నుండి నమోదయ్యాయి. “సంబంధిత దుకాణ మార్కెట్లు మూసివేయబడతాయి. కరోనావైరస్ కు వ్యతిరేకంగా మా పోరాటంలో సహకరించాలని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. కొత్త కోవిద్-19 కేసులు రాష్ట్ర రాజధానిలోని ఒక ప్రాంతం నుండి నివేదించబడినందున ప్రజలు భయపడవద్దని ముఖ్యమంత్రి కోరారు.
“ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, ఇది భువనేశ్వర్ ప్రాంతంలో ఉంది. ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి దయచేసి బయటికి వెళ్లి లాక్డౌన్ ను ఉల్లంఘించవద్దు. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు” అని ఆయన చెప్పారు.