మహీంద్రా సరికొత్త ప్రయత్నం.. నూతన యూనివర్సిటీ ప్రారంభం..

| Edited By:

Jul 24, 2020 | 3:04 PM

ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని మహీంద్రా గ్రూప్ తమ మహీంద్రా విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది.తెలంగాణ మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వర్చువల్‌గా యూనివర్సిటీని ప్రారంభించారు.

మహీంద్రా సరికొత్త ప్రయత్నం.. నూతన యూనివర్సిటీ ప్రారంభం..
Follow us on

ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని మహీంద్రా గ్రూప్ తమ మహీంద్రా విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వర్చువల్‌గా యూనివర్సిటీని ప్రారంభించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో 130 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ (పిహెచ్‌డి) కోర్సులు అందించనున్నట్లు తెలిపారు. మహీంద్రా ఎకోలే సెంట్రేల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కూడా ఈ యూనివర్సిటీలో భాగం కానుంది.

ఈ క్రమంలో.. యూనివర్సిటీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని ఆనంద్ మహీంద్రా అన్నారు. మెరుగైన ప్రపంచం కోసం భావితరాలకు విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం 1950ల్లోనే కేసీ మహీంద్రా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ప్రారంభించారన్నారు. ప్రతి 8 మంది భారతీయుల్లో ఒకరు మాత్రమే కాలేజీ విద్యను అభ్యసించగల్గుతున్నారని ఆనంద్ మహీంద్రా తెలిపారు.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..