దేవరకొండ కోసం మహేష్ సాయం!

| Edited By: Pardhasaradhi Peri

Oct 16, 2019 | 3:12 PM

రౌడీ విజయ్ దేవరకొండ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. తరుణ్ భాస్కర్, వాణీ భోజన్, అనసూయలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇవాళ ఈ చిత్ర ట్రైలర్‌ను మహేష్ బాబు చేతుల మీద విడుదల చేయనున్నారు. గతంలో మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు దేవరకొండను చీఫ్ ఫస్ట్‌గా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు […]

దేవరకొండ కోసం మహేష్ సాయం!
Follow us on

రౌడీ విజయ్ దేవరకొండ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. తరుణ్ భాస్కర్, వాణీ భోజన్, అనసూయలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇవాళ ఈ చిత్ర ట్రైలర్‌ను మహేష్ బాబు చేతుల మీద విడుదల చేయనున్నారు.

గతంలో మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు దేవరకొండను చీఫ్ ఫస్ట్‌గా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండకు రిటర్న్ గిఫ్ట్‌గా మహేష్ బాబు ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దేవరకొండ తన ప్రతి సినిమాలోనూ ఏదొక ప్రత్యేకతను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. అలాగే ఈ చిత్రం కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాడని సమాచారం. అటు మహేష్ బాబు ట్రైలర్‌ను లాంచ్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగినట్లే. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఏమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.