మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. పెళ్లైన ఐదు రోజులకే వైద్యుడు దుర్మరణం.. మూడు నెలల వ్యవధిలో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

|

Dec 21, 2020 | 5:23 PM

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మూడు నెలల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తాజాగా పెళ్లైన ఐదు రోజులకే మరోకరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. పెళ్లైన ఐదు రోజులకే వైద్యుడు దుర్మరణం.. మూడు నెలల వ్యవధిలో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి
Follow us on

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మూడు నెలల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తాజాగా పెళ్లైన ఐదు రోజులకే మరోకరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన అబ్దుల్ మోసిన్ (29) యునాని వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 15న సిద్దిపేట జిల్లాకు చెందిన అమీనా తపస్సుతో వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు భార్యతో కలిసి కారులో బయలుదేరాడు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద 44 జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు, డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోసిన్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని భార్య స్వల్ప గాయాలతో బయటపడింది.

ఇక, మోసిన్ కుటుంబంలో 3 నెలల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మోసిన్ తండ్రి తన్వర్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అన్వర్ నలుగురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరు వైద్యులు కాగా, ఒక కుమారుడు బీటెక్ చదివాడు. అక్టోబర్ నెలలు రెండో కుమారుడు డాక్టర్ జాహిద్ వర్షంలో మిద్దె పై నుంచి దిగుతూ కాలుజారి కిందపడి తలకు బలమైన గాయమై మృతి చెందాడు. కొడుకు మరణ వార్త విని తండ్రి అన్వర్ గుండెపోటుతో అదే రోజు మరణించాడు. తాజాగా, మూడో కుమారుడు మోసిన్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.