బ్రేకింగ్: ‘దర్బార్’ సినిమాకి మద్రాస్ హైకోర్టు షాక్.. విడుదలకు!

| Edited By:

Jan 07, 2020 | 4:15 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘దర్బార్’ విడుదలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఇప్పటికే.. ప్రపంచ వ్యాప్తంగా 8 వేల స్క్రీన్స్‌లో ఈ నెల 9న విడుదలకు సిద్ధమైంది ఈ చిత్రం. కాగా.. మలేషియాలో తమిళులు అధికంగా ఉండటంతో.. ఎక్కువ స్క్రీన్స్‌లో దర్బార్ విడుదలకు సన్నాహాలు జరుగుతోన్నాయి. అయితే.. లైకా ప్రొడక్షన్ ‘2.0’ చిత్రానికి సంబంధించి మలేషియా సంస్థకు 23 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు సమాచారం. బకాయిలు చెల్లించకుండా ఆ దేశంలో ‘దర్బార్’ విడుదలపై స్టే విధించాలని, […]

బ్రేకింగ్: దర్బార్ సినిమాకి మద్రాస్ హైకోర్టు షాక్.. విడుదలకు!
Follow us on

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘దర్బార్’ విడుదలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఇప్పటికే.. ప్రపంచ వ్యాప్తంగా 8 వేల స్క్రీన్స్‌లో ఈ నెల 9న విడుదలకు సిద్ధమైంది ఈ చిత్రం. కాగా.. మలేషియాలో తమిళులు అధికంగా ఉండటంతో.. ఎక్కువ స్క్రీన్స్‌లో దర్బార్ విడుదలకు సన్నాహాలు జరుగుతోన్నాయి. అయితే.. లైకా ప్రొడక్షన్ ‘2.0’ చిత్రానికి సంబంధించి మలేషియా సంస్థకు 23 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు సమాచారం. బకాయిలు చెల్లించకుండా ఆ దేశంలో ‘దర్బార్’ విడుదలపై స్టే విధించాలని, మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. అక్కడ ఈ సినిమా విడుదలకు 4.90 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు తెలిపింది. లేని పక్షంలో మలేషియాలో దర్బార్ సినిమా విడుదలకు అనుమతించబోమని హైకోర్టు తెలియజేసింది.