చంద్రగ్రహణం ముగిసింది. మూసిన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల తిరుపతి ఆలయం సహా ప్రముఖ ఆలయాలన్ని తెరిచారు. ఇవాళ ఉదయం 4.30 నిమిషాలకు ఆలయాలకు సంప్రోక్షణ తెరిచి సుప్రభాత సేవలు నిర్వహించి, భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. రాత్రి 1.30 నిమిషాల తర్వాత మొదలైన గ్రహణం తెల్లవారు జామున 3 గంటల సమయంలో పరిపూర్ణం అయ్యింది. గ్రహణం పట్టిన చంద్రుడిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. భారత్తో పాటు పలు దేశాల్లో కూడా ఈ చంద్రగ్రహణం ప్రజలకు కనిపించి కనువిందు చేసింది. కాగా.. ఉదయం 4.30 నిమిషాల సమయంలో చంద్రుడిని పూర్తిగా గ్రహణం వీడింది.