ఆస్పత్రి‌లో.. చిరుత పులి కలకలం..

| Edited By:

Apr 16, 2020 | 7:31 PM

గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ చిరుత కలకలం రేపింది. నగరంలోని కోలావాడా ఆయుర్వేద ఆస్పత్రిలోకి బుధవారం ఓ చిరుతపురి చొరబడింది. ఆస్పత్రి టాయిలెట్‌లో చిరుతపులిని చూసేసరికి సిబ్బందితో పాటు అక్కడి వారందరూ

ఆస్పత్రి‌లో.. చిరుత పులి కలకలం..
Follow us on

గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ చిరుత కలకలం రేపింది. నగరంలోని కోలావాడా ఆయుర్వేద ఆస్పత్రిలోకి బుధవారం ఓ చిరుతపురి చొరబడింది. ఆస్పత్రి టాయిలెట్‌లో చిరుతపులిని చూసేసరికి సిబ్బందితో పాటు అక్కడి వారందరూ భయాందోళనకు గురయ్యారు. చిరుత బయటకు రాకుండా తలపులు మూసివేసిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అస్పత్రి సిబ్బంది సహాయంతో చిరుతను బంధించారు. దీంతో సిబ్బందితో పాటు.. రోగులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు.. కోవిద్-19 మహమ్మారి విజృంభిస్తున్న సంగతి విదితమే. గుజరాత్‌లో ఇప్పటివరకూ 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 33 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. మరో 64 మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Also Read: హైవేపై.. హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగిందంటే..

Also Read: అక్కడ.. 10 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. 

Also Read: లాక్‌డౌన్ నేపథ్యంలో.. వాహన, ఆరోగ్య బీమాదారులకు భారీ ఊరట..