ఉత్తరాఖండ్‌లో విషాదం.. విరిగిపడిన కొండ చరియలు

|

Jul 23, 2020 | 6:51 AM

ఉత్తరాఖండ్‌లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికి తోడు అక్కడి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పితోర్‌గఢ్‌ జిల్లాలోని తంగా...

ఉత్తరాఖండ్‌లో విషాదం.. విరిగిపడిన కొండ చరియలు
Follow us on

ఉత్తరాఖండ్‌లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికి తోడు అక్కడి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పితోర్‌గఢ్‌ జిల్లాలోని తంగా గ్రామంలో వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది గల్లంతైనట్టు అక్కడి అధికారులు గుర్తించారు.

వారి ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు మృతదేహాలను ప్రమాద స్థలం నుంచి బయటకుతీశారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు.

పితోర్‌గఢ్‌, అస్కోట్‌, అల్మోరా ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సైతం గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. డాగ్‌ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దించి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.