బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నిజంగా అనారోగ్యానికి గురయ్యాడా? దీనిపై వస్తున్న వార్తలు నిజమా.. అబద్ధమా..

|

Dec 20, 2020 | 5:56 AM

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నిజంగా అనారోగ్యానికి గురయ్యాడా? దీనిపై వస్తున్న వార్తలు నిజమా.. అబద్ధమా..
Follow us on

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఝార్ఖాండ్ జైళ్లశాఖ ఐజీ వీరేంద్ర భూషణ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. లాలు ప్రసాద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, కావాలనే ఆయనకు సహాయం చేయడానికి వదంతులు పుట్టిస్తున్నారని స్పష్టం చేశారు. దీనికి కారణమైన రిమ్స్ వైద్యుడు ఉమేష్ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.

లాలు ఆరోగ్యం బాగాలేదని, కేవలం 25 శాతం సామర్థ్యంతో మూత్రపిండాలు పినిచేస్తున్నాయని ఉమేష్ ప్రసాద్ చెప్పడంతో మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. దీనిపై రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వరప్రసాద్‌ను వివరణ కోరగా తాము ఎలాంటి విషయం మీడియాకి తెలుపలేదని, కావాలనే మీడియా వారు రచ్చ చేస్తున్నారని అన్నారు. కాగా లాలూ ఆరోగ్యంపై నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా రిపోర్టు ఇవ్వడం సరికాదని, ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగం నుంచి ఉమేష్ ఎటువంటి అభిప్రాయం తీసుకోలేదని రిమ్స్ ప్రతినిధి వాఘ్మరే కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. రిమ్స్‌లో నిబంధనలను ఉమేష్ ఉల్లంఘిస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది ఆరోపించారు. అటు లాలూ ఆరోగ్యంపై ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ కూడా మండిపడ్డారు. ఆయనకు సహాయం చేయడానికే ఇవన్ని చేస్తున్నారని విమర్శించారు.