తప్పు చేసేవారి తోలు తీసి నిజం చెప్పిస్తారు కాబట్టి..పోలీస్ వాళ్లు బయటి జనాలకు కాస్త కఠినంగా కనిపిస్తారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తే.. ఇప్పుడు కేటుగాళ్లు మాట వినడం లేదు కాబట్టి..అప్పుడప్పుడు లాఠీలు ఝులిపిస్తున్నారు. కాప్స్కి కూడా మంచి మనసు ఉంటంది. వారికి కూడా ఎమోషన్స్, రిలేషన్స్ ఉంటాయి. నలుగురుకి సాయం చేసే గుణం, సొసైటీ బాగుండాలనే ఆశ ఉంటాయి. తాజాగా ఓ ఎస్సై వృద్ధురాలికి ఇళ్లు కట్టించి..తన మంచి మనసు చాటుకోవడంతో పాటు డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకువచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే… కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పెద్దపుదేళలో ఉంటున్న లక్ష్మమ్మకు నలుగురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అయితే ఒక కుమార్తె భర్త చనిపోయాడు. అప్పటినుంచి ఆ కుమార్తె, మనవరాళ్లతో కలిసి స్థానిక పశువుల ఆసుపత్రి ఆవరణలో జీవం సాగిస్తోంది లక్ష్మమ్మ. ఆ వృద్ధురాలి దీన పరిస్థితి గురించి తెలుసుకున్న ఎస్సై మారుతి శంకర్ చలించిపోయారు. తనవంతుగా ఆమెకు ఏదైనా సాయం చేయాలని భావించారు. ఊరిలో తన సొంత డబ్బు రూ. 50 వేలతో ఒక సెంటు స్థలాన్ని కొని.. రూ. 80వేలతో ఇల్లు కట్టించారు. బుధవారం గృహప్రవేశం చేసి వృద్ధురాలికి ఇల్లు అప్పగించారు. గతంలోనూ మారుతి శంకర్ చాలామందికి సాయం చేసి మంచి మనసున్న పోలీస్గా కీర్తి గడించాడు.
Also Read :
తిరుమలలో వృద్ధులకు స్లాట్లు కేటాయింపు వార్తలపై టీటీడీ క్లారిటీ
సీనియర్ హీరోయిన్ల ఫేవరెట్ యాక్టర్గా మారిన జూనియర్ రామారావు
రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు