కేంద్రం నిధులివ్వకపోయినా అభివృద్ధి ఆగదు: కేటీఆర్

|

Sep 16, 2020 | 2:07 PM

కేంద్రం బకాయిలు ఇవ్వకున్నా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏ మాత్రం ఆగడం లేదని రాష్ట్ర మునిసిపల్ పరిపాలనా శాఖా మంత్రి కే. తారక రామారావు వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాకున్నా హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు...

కేంద్రం నిధులివ్వకపోయినా అభివృద్ధి ఆగదు: కేటీఆర్
Follow us on

కేంద్రం బకాయిలు ఇవ్వకున్నా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏ మాత్రం ఆగడం లేదని రాష్ట్ర మునిసిపల్ పరిపాలనా శాఖా మంత్రి కే. తారక రామారావు వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాకున్నా హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల పంపిణీలో జాప్యం జరగడం లేదని ఆయన రాష్ట్ర శాసనమండలిలో బుధవారం ప్రకటించారు. జీహెచ్ఎంసీకి నిధుల కొరత వున్నా.. నగరంలో ఆస్తిపన్ను, నీటి పన్నులను పెంచడం లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయనన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్.ఆర్.డీ.పీ. ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి నేటి వరకు హైదరాబాద్ నగరంలో క్యాపిటల్ ఖర్చు 67 కోట్లు చేశామని తెలిపారు. ఇంకా రెవెన్యూ ఖర్చు కలిపితే లక్ష కోట్ల రూపాయలు దాటుతుందని కేటీఆర్ వివరించారు. లాక్ డౌన్‌ పీరియడ్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అద్బుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపిన కేటీఆర్ నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.