కొనసాగుతున్న కృష్ణా నదీ బోర్డు భేటీ

|

Jun 04, 2020 | 2:49 PM

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన అజెండా.

కొనసాగుతున్న కృష్ణా నదీ బోర్డు భేటీ
Follow us on

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. బోర్డు ఛైర్మన్‌ పరమేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో.. డీపీఆర్‌లతో పాటు నీటి కేటాయింపులు, టెలీమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీపై సంగమేశ్వర్ వద్ద పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఈ సమావేశం కీలకంగా మారింది. ఇక 12 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేశారు.