కృష్ణానది నీటి విడుదల… ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2019 | 6:27 AM

ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ రోజు కృష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ట్రాల  మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై సమావేశంలో చర్చించారు. నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి విడుదల ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ వరకు తెలంగాణ రాష్ర్టానికి 59 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 152 టీఎంసీల నీటిని కేటాయించింది. తెలంగాణ రాష్ర్టానికి శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, […]

కృష్ణానది నీటి విడుదల... ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు
Follow us on

ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ రోజు కృష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ట్రాల  మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై సమావేశంలో చర్చించారు. నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి విడుదల ఆదేశాలు ఇచ్చింది.

సెప్టెంబర్ వరకు తెలంగాణ రాష్ర్టానికి 59 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 152 టీఎంసీల నీటిని కేటాయించింది. తెలంగాణ రాష్ర్టానికి శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 44.5 టీఎంసీలు కేటాయిచింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు 14.50 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ నుంచి 26.06 టీఎంసీలు, ఎలిమనేటి మాదవరెడ్డి ప్రాజెక్టు నుంచి 10.47 టీఎంసీలు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 5.90 టీఎంసీలు, మిషన్ భగీరథ పథకానికి 2.08 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 52 టీఎంసీలు, పోతిరెడ్డి పాడు నుంచి 88 టీఎంసీలు, హంద్రీనీవా, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకానికి 12 టీఎంసీలు, కృష్ణా డేల్టాకు 10 టీఎంసీలు కేటాయించారు.