జిల్లా ఎస్పీగా మారిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి జూనియర్ విన్నర్..!

|

May 28, 2020 | 9:27 PM

చదువుతో పాటు అదృష్టం కలిసొస్తే అనుకొన్నది సాధ్యమవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ. చిన్నతనం నుంచే విద్యాపాటవాలు ప్రదర్శించి ఓ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణస్తున్నాడు. 2001లో ప్రసారమైన కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్న రవిమోహన్‌ సైనికి అప్పుడు 14 ఏండ్లు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కేబీసీ జూనియర్‌లో పాల్గొని 15 ప్రశ్నలకు […]

జిల్లా ఎస్పీగా మారిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి జూనియర్ విన్నర్..!
Follow us on

చదువుతో పాటు అదృష్టం కలిసొస్తే అనుకొన్నది సాధ్యమవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ. చిన్నతనం నుంచే విద్యాపాటవాలు ప్రదర్శించి ఓ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణస్తున్నాడు. 2001లో ప్రసారమైన కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్న రవిమోహన్‌ సైనికి అప్పుడు 14 ఏండ్లు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కేబీసీ జూనియర్‌లో పాల్గొని 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కరోడ్‌పతిగా నిలిచాడు. అనంతరం జైపూర్‌లో ఉన్నతవిద్య పూర్తిచేసి అక్కడే ఎంబీబీఎస్‌ కూడా పూర్తి చేశాడు. నేవీలో పనిచేస్తున్న తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో 2014లో సివిల్స్‌ రాసి 461 ర్యాంకు సాధించిన రవిమోహన్‌ సైని.. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోర్‌బందర్‌ ఎస్సీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలుచేయడంలో దృష్టిసారించామని, శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తానని సైనీ చెప్పారు. 14 ఏండ్ల ప్రాయంలో అమితాబ్‌ బచ్చన్‌ సార్‌తో కలువడం, కోటి రూపాయలు గెలువడం జీవితంలో మరిచిపోలేని అనుభూతులని అన్నారు.