విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీకయ్యి 12 మందిని పొట్టనబెట్టుకోగా.. దీని ప్రభావానికి గురయిన వందలాది మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కళ్లముందే సొంతవాళ్లు విగతజీవులుగా మారడం చూసిన చనిపోయినవారి బంధువుల వేధనలు మిన్నంటున్నాయి. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ ఐ ఆర్ – ఎన్ ఈ ఈ ఆర్ ఐ నిపుణుల బృందం పర్యటించి నివేదిక రూపొందించింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రహదారులు, ఇళ్ళలో స్టైరీన్ అవసేషాలు గుర్తించిన నిపుణుల బృందం..అక్కడి ప్రజలకు బృందం పలు సూచనలు చేసింది.