ట్విట్టర్ వార్: కేశినేని వర్సెస్ పీవీపీ

| Edited By:

Jul 27, 2019 | 1:21 PM

ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో ట్వీట్లు చేస్తూ వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉంటే ఎంపీ కేశినేని నాని.. తాజాగా కమ్యూనిస్టు పార్టీ నేతల తీరుపై ట్వీట్ చేశారు. విజయవాడలో కేశినేని ట్రావెల్స్‌కు చెందిన మాజీ ఉద్యోగులు చేసిన ధర్నాకు సీపీఐ నేతలు మద్దతు పలకడంతో.. వారిని విమర్శిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటం వల్లే.. ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి […]

ట్విట్టర్ వార్:  కేశినేని వర్సెస్ పీవీపీ
Follow us on

ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో ట్వీట్లు చేస్తూ వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉంటే ఎంపీ కేశినేని నాని.. తాజాగా కమ్యూనిస్టు పార్టీ నేతల తీరుపై ట్వీట్ చేశారు. విజయవాడలో కేశినేని ట్రావెల్స్‌కు చెందిన మాజీ ఉద్యోగులు చేసిన ధర్నాకు సీపీఐ నేతలు మద్దతు పలకడంతో.. వారిని విమర్శిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటం వల్లే.. ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది అంటూ ట్వీట్టర్ ద్వారా విమర్శలు చేశారు. ఈ ట్వీట్‌కు కౌంటర్‌గా అన్నట్టు పీవీపీ మరో ట్వీట్ చేశారు. తాను కూడా ఆ విషయంపైనే బాధపడుతున్నానని.. పండిట్ నెహ్రు లాంటి యోధాను యోధులను ‘ఢీ ‘ కొట్టిన ఎర్ర సోదరులు, ఎంతో ఘనమైన దోపిడీ చరిత్ర కలిగిన కోన్ కిస్కాగాడితో యుద్ధం చెయ్యాల్సి వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు విజయవాడలో కేశినేని వర్సెస్ పీవీపీ అన్నట్లు తయారైంది.