ఇన్నిరోజులు జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారించిన రాజకీయ నాయకులు, అధికారులు ప్రస్తుతం పాలనా పరమైన విధులలో నిమగ్నమయ్యారు. తాజాగా ఈ నెల 7న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఈ సమీక్షలో రెండో విడత రైతుబంధు నిధుల విడుదలపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. భేటీలో వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.