నల్గొండజిల్లాలో డీసీఎంను వెనుక నుంచి ఢీకొన్న కారు.. మహిళ మృతి

|

Nov 02, 2020 | 8:41 AM

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఆటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు వేగంగా వచ్చి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు పైభాగం మొత్తం చెత్తచెత్త అయిపోయి టాప్ ఎగిరిపోగా, కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 108 […]

నల్గొండజిల్లాలో డీసీఎంను వెనుక నుంచి ఢీకొన్న కారు.. మహిళ మృతి
Follow us on

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఆటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు వేగంగా వచ్చి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు పైభాగం మొత్తం చెత్తచెత్త అయిపోయి టాప్ ఎగిరిపోగా, కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించి చికిత్స అందిస్తున్నారు.