Kangana Ranaut served Legal Notice: దేశంలో జరుగుతోన్న ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోందీ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత కంగనా ఏదో ఒక సంచలనానికి కేరాఫ్గా నిలుస్తోంది. వివాదాస్ప వ్యాఖ్యలు, ట్వట్టర్లో పోస్ట్లతో కాంట్రవర్సీని ఇంటి పేరుగా మార్చుకున్న కంగనాకు తాజాగా లీగల్ నోటీసులు అందాయి.
వివరాల్లోకి వెళితే.. కంగనా రనౌత్ ఇటీవల ‘మణికర్ణిక’ సినిమాకు సీక్వెల్గా ‘మణికర్ణిక.. ది లెజెండ్ ఆఫ్ దిద్దా’ పేరుతో కాశ్మీరీ రాణి జీవితగాథను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇదే విషయమై ఆశిష్ కౌల్ అనే వ్యక్తి కంగనా రనౌత్కు లీగల్ నోటీసులు పంపించారు. రచయిత అయిన ఆశిష్.. కాశ్మీరీ రాణి జీవితగాథను ‘దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి’ పేరుతో పుస్తకాన్ని ఇదివరకే ప్రచురించారు. 2017లో ఈ పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ కూడా విడుదలైంది. కాశ్మీర్ రాణి దిద్దా జీవితగాథకు సంబంధించి అశిష్ కౌల్ హక్కులను కలిగి ఉన్నాడు. దీంతో తన అనుమతి లేకుండా కంగనా.. కాశ్మీర్ రాణి జీవిత కథను సినిమాగా తెరకెక్కించడాన్ని తప్పుపట్టిన ఆశిష్ కంగనాకు నోటీసులు పంపాడు. మరి ఆశిష్ పంపిన నోటీసులపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: Allu Arjun’s ‘Pushpa’: నో పార్టీస్.. నో ఫెస్టివల్స్.. మారేడుమిల్లిలో తెగ కష్టపడుతోన్న బన్నీ