kajal Aggarwal Insta Chat: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య అంతరం తగ్గిపోతోంది. అభిమానులు తమకు ఇష్టమైన తారలతో నేరుగా మాట్లాడగలిగే వీలు కలిగింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా తమ అభిమానులు అడిగే ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఈ సందర్భంగా ‘మీకు కోపం ఎప్పుడు వస్తుంది’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. హిపోక్రసీ, అబద్ధాల విషయాల్లో గతంలో చాలా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం హిపోక్రసీ ఉన్న వాళ్లను, అబద్ధాలు ఆడేవాళ్లను చూస్తే పాపం అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.
ఇక ‘మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది’ అన్ని ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పిన కాజల్.. ‘ఉదయం లేవగానే ఇంకో రోజు వచ్చిందని చాలా కృతజ్ఞతగా ఉంటాను. పెద్ద గ్లాస్ వేడి నీళ్లలో పసుపు, అల్లం వేసుకుని తాగుతాను. అలాగే మా ఆయనకో పెద్ద హగ్ ఇస్తాను’అని తెలిపింది.
ఇక పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ.. బాధ్యత పెరిగిందని, అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత మా ఆయనకే ఇవ్వాలనుందని తెలిపింది. ఇక అటువైపు నుంచి కూడా అలానే ఉండాలనుందని తన మనసులో మాట బయటపెట్టింది.