రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా దగ్గరగా, అంతరిక్షంలో ఈనెల 21న ఆవిష్కృతం కానున్న మహాద్భుతం

|

Dec 07, 2020 | 5:51 AM

అంతరిక్షంలో ఈనెల 21న మహాద్భుతం ఆవిష్కృతం కానుంది. రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా ఇవి దగ్గర కానున్నాయి...

రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా దగ్గరగా,  అంతరిక్షంలో ఈనెల 21న ఆవిష్కృతం కానున్న మహాద్భుతం
Follow us on

అంతరిక్షంలో ఈనెల 21న మహాద్భుతం ఆవిష్కృతం కానుంది. రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా ఇవి దగ్గర కానున్నాయి. అంతేకాదు, ఓ భారీ నక్షత్రంలా ప్రకాశించనున్నాయి. సౌర కుటుంబంలోని రెండు పెద్ద గ్రహాలైన గురుడు, శని ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి రానుండడమే దీనికి కారణం. ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.50 కోట్ల కిలో మీటర్లుగా మాత్రమే ఉంటుంది. 1623వ సంవత్సరం తర్వాత జరిగే ఈ అద్భుతం ఖగోళ ప్రియులకు కనువిందు చేయనుంది. ‘మహా సంయోగం’గా పిలిచే ఈ అంతరిక్ష అద్భుతం భారతీయులకు కూడా కనువిందు చేస్తుందని, దేశంలోని అన్ని ప్రాంతాల వారూ సూర్యాస్తమయం తర్వాత చూడవచ్చని కోల్‌కతాలోని జేపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్‌ దేవీ ప్రసాద్‌ దురై వెల్లడించారు.