JNTU to hold exams for final year: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి, చాలా పరీక్షలు రద్దయ్యాయి. యూజీసీ తాజా నిర్ణయంతో అన్ని కోర్సులకు సంబంధించి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించేందుకు జేఎన్టీయూ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ సూచనల మేరకు సెప్టెంబరు 1 లేదా 15 నుంచి పరీక్షలు నిర్వహించే దిశగా జేఎన్టీయూ యోచిస్తోంది. ఉన్నత విద్యా మండలి నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే పరీక్షల షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించే దిశగా వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అటానమస్ కాలేజీలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.
Also Read: విధులకు హాజరు కాకపోతే.. రిటైర్మెంటే గతి ..!