ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబును ప్రముఖ నటి, వైసీపీ నాయకురాలు జయసుధ కలిశారు. బాబు నివాసంలో భేటీ అయిన ఆమె..తన కుమారుడి వివాహా వేడుకకు రావాల్సిందిగా చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సమయంలో జయసుధ వెంట ఆమె సోదరి, నటి సుభాషిణి కూడా ఉన్నారు. జయసుధకు (నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్) ఇద్దరు తనయులున్నారు. కాగా నిహాన్ కపూర్ వివాహాం ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్తో జరగనున్నట్టు సమాచారం. కాగా జయసుధ భర్త నటుడు, నిర్మాత నితిన్ కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జయసుధ..సికింద్రాబాద్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణాంతరం..చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీలోకి వెళ్లారు. కాగా ఇటీవల ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఇది కూడా చదవండి : అప్పుడు ఒకే సినిమాలో..ఇప్పుడు ఒకే పాత్రలో..