డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలను రద్దు చేయండిః పవన్ కళ్యాణ్

|

Jun 23, 2020 | 1:50 PM

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విధంగానే డిగ్రీ, పీజీ, బీటెక్ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు. ”కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి […]

డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలను రద్దు చేయండిః పవన్ కళ్యాణ్
Follow us on

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విధంగానే డిగ్రీ, పీజీ, బీటెక్ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు. ”కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారి విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలి.

డిగ్రీతోపాటు ఎం.బి.ఎ, ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐ.టీ.ఐ, లాంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదు. ఈ విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, హాస్టల్స్‌లో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదు. మరో వైపు పైచదువులకు వెళ్ళేందుకు, క్యాంపస్ సెలెక్షన్స్‌లో జరిగిన ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు సమయం దగ్గరపడుతోందని… పరీక్షలు లేని కారణంతో పట్టాలు చేతికిరాక అర్హత కోల్పోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్థులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలి. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.