Janasena party: జనసేన మరో కీలక అడుగు.. పవన్ ఏం చేశారంటే!

|

Feb 24, 2020 | 5:03 PM

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా సోమవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీతో సమన్వయాన్ని దృష్టిలో వుంచుకుని పవన్ కల్యాణ్ కీలక అడుగు వేశారు.

Janasena party: జనసేన మరో కీలక అడుగు.. పవన్ ఏం చేశారంటే!
Follow us on

Janasena party a step ahead: జనసేన పార్టీగా ఆవిర్భవించి ఆరేళ్ళ గమనంలో మరో కీలక అడుగు పడింది. ఓ వైపు సినిమాల్లో తిరిగి నటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోవైపు ఏపీలో జనసేన పార్టీ పటిష్టతకు చర్యలు ముమ్మరం చేశారు.

జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీలను సోమవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలుండగా.. వాటికి రీజియన్స్ వారీగా.. అయిదు కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయల దక్షిణ కోస్తా.. రాయలసీమ సంయుక్త కమిటీలలో పార్టీ సీనియర్ నాయకులను సభ్యులుగా చేరుస్తూ సంయుక్త పార్లమెంటరీ కమిటీల పేరుతో అయిదు కమిటీలను ఖరారు చేశారు.

జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీల వివరాలు:

1 . ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ: శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖపట్టణం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి), జాయింట్ కన్వీనర్‌గా గడసాల అప్పారావు (గాజువాక), సభ్యులుగా పరుచూరి భాస్కర రావు (అనకాపల్లి), పేడాడ రామ్మోహన్ (ఆమదాలవలస), డాక్టర్ బొడ్డేపల్లి రఘు (విశాఖపట్నం)గా ఉంటారు.

2 . గోదావరి సంయుక్త కమిటీ: కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు గోదావరి సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా మేడా గురుదత్ (రాజమహేంద్రవరం) శెట్టిబత్తుల రాజబాబు (అమలాపురం) జాయింట్ కన్వీనర్‌గా, సభ్యులుగా వేగుళ్ల లీలాకృష్ణ (మండపేట), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), యిర్రంకి సూర్యారావు (భీమవరం), గుణ్ణం నాగబాబు (పాలకొల్లు) సభ్యులుగా ఉంటారు.

3 . సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ: విజయవాడ, మచిలీపట్టణం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాలకు సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె., గుంటూరు), జాయింట్ కన్వీనర్‌గా సయ్యద్ జిలానీ (నరసరావుపేట), సభ్యులుగా పోతిన వెంకట మహేష్ (విజయవాడ), అమ్మిశెట్టి వాసు (విజయవాడ), గాదె వెంకటేశ్వర రావు (గుంటూరు), పాకనాటి రమాదేవి (గుంటూరు) సభ్యులుగా ఉంటారు.

4 . రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ: తిరుపతి, చిత్తూరు, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా డా.పసుపులేటి హరిప్రసాద్, షేక్ రియాజ్ జాయింట్ కన్వీనర్ గా, సభ్యులుగా డా. పొన్ను యుగంధర్ (గంగాధర నెల్లూరు), సయ్యద్ ముకరం చాంద్ (రాజంపేట), యగవింటి (మైఫోర్స్) మహేష్ (మదనపల్లి), మాసి కృష్ణమూర్తి (తిరుపతి), ఆరేటి కవిత (చిత్తూరు), శ్రీ గానుగపెంట శ్రీకాంత్ (నెల్లూరు) ఉంటారు.

5 . రాయలసీమ సంయుక్త కమిటీ: అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప పార్లమెంట్ నియోజకవర్గాలకు రాయలసీమ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా టి.సి.వరుణ్ (అనంతపురం), సుంకర శ్రీనివాస్ (కడప) జాయింట్ కన్వీనర్‌గా, సభ్యులుగా చింతా సురేష్ (కర్నూలు), రేఖ గౌడ్ (ఎమ్మిగనూరు), ఆకుల ఉమేష్ (హిందూపురం), మలిశెట్టి వెంకటరమణ (కడప) ఉంటారు.

ఈ కమిటీలు మిత్రపక్షం బీజేపీ స్థానిక కమిటీలతో సమన్వయం చేసుకొంటూ ఉభయ పార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ అధ్యక్షుని ఆదేశాలను జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్థాయి వరకూ అమలయ్యేలా చూడటం, కమిటీ పరిధిలో ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీని క్షేత్ర స్థాయి వరకూ పటిష్టం చేయడం లక్ష్యాలుగా పని చేస్తాయి.

Read this: Jagan anger on TDP cheap tricks టీడీపీ ట్రిక్కులపై జగన్ ఆవేదన, ఆగ్రహం