టీపీసీసీ పదవీపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు.. కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ.

|

Dec 26, 2020 | 1:03 PM

తెలంగాణ పీసీసీ పదవీపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని...

టీపీసీసీ పదవీపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు.. కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ.
Follow us on

jagga reddy letter to congress: తెలంగాణ పీసీసీ పదవీపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకూ ఉత్తమ్‌నే పీసీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని కోరారు.
అంతేకాకుండా ఈ నిర్ణయంపై పార్టీలోని సీనియర్ నాయకులతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో మారుతోన్న రాజకీయాల నేపథ్యంలో బలమైన లీడర్ షిప్ ఉన్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరముందని జగ్గా రెడ్డి తెలిపారు. అందుకే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పీసీసీని ప్రకటించాలన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.